ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత్, బంగ్లాదేశ్లలో ఉగ్రవాద దాడులు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ తోపాటు బంగ్లాదేశ్ ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు అబూ ముహమ్మద్ అల్ బెంగాలీ హెచ్చరించారు. ఐఎస్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన భారత నిఘా వర్గాలు పోలీసులను అలర్ట్ చేశాయి. దీంతో బెంగాల్ రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కోల్కతా తోపాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వేశారు. ఎలాంటి పేలుళ్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.