‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్’ సేల్ ప్రారంభం

SMTV Desk 2019-05-01 12:34:34  flipkart flipstart day sale

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మే 1 నుంచి 3 వరకు ‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్’ సేల్ పేరుతో తమ కస్టమర్లపై ఆఫర్ల వర్షం కురిపించేందుకు రెడీ అయింది. ఈ సేల్‌లో 80 శాతం వరకు డిస్కాంట్ ఇవ్వబోతున్నట్టు ప్లిప్ కార్ట్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంకు క్రిడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై మరో 10శాతం డిస్కాంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా, ఇది ఇఎంఐ లావాదేవీలకు మాత్రమేనని ఖండిషన్ పెట్టింది సంస్థ. జెబిఎల్, సోనీ, బోట్ కంపెనీల హెడ్‌ఫోన్స్‌పై 70 శాతం రాయితీ ఇవ్వబోనుంది.పవర్ బ్యాంకుల కనీస ప్రారంభ ధర రూ.500. మొబైల్ యాక్సెసరీస్ రూ.99 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఎసర్, హెచ్‌పి, డెల్, ఆసుస్, ఇతర కంపెనీల ల్యాప్‌టాప్‌లపైనా భారీ రాయితీలు అందివ్వనుందని అధికారులు తెలిపారు. ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.13,990. టివిలు, హోం అప్లయెన్సెస్‌పై తమ వినియోగదారులకు 75శాతం రాయితీ లభించనుంది. థామ్సన్ 40 ఇంచుల ఫుల్ హెచ్‌డి స్మార్ట్‌టివిని రూ.17,499కే సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లు ఎంపిక చేసిన టివిలు, ల్యాప్‌టాప్‌లపై అదనంగా మరో 10 శాతం డిస్కాంట్ ఇస్తున్నట్టు ప్లిప్ కార్ట్ ప్రకటించింది.