జపాన్: జపాన్కు 126వ చక్రవర్తిగా నరుహితో భాధ్యతలు చేపట్టారు. 85ఏళ్ల అకిహితో క్రైసెంథమమ్ తన పదవి నుండి తొలగిపోవడంతో 59 ఏళ్ల నరుహితో శాస్త్రోక్తంగా సింహాసనాన్ని అధిష్టించారు. కొత్త చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు చేపట్టడంతో జపాన్ లో రీవా శకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు నరుహితో. జపాన్ సహా విశ్వవ్యాపంగా ఉన్న ప్రజలు శాంతి సౌభాగ్యాలు, సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఇక ఇక రూమ్ ఆఫ్ పైన్ లో జరిగిన కార్యక్రమంలో జపాన్ ప్రధాని షింజో అబే సహా దాదాపు 12మంది రాజకుటుంబీకులు పాల్గొన్నారు