నెల్లూరు: తుఫానుగా మారిన ఫణి వాయుగుండం నెల్లూరు జిల్లాలో తీవ్రతరం అయింది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు చాలా వేగంగా వీస్తున్నాయి. దీంతో సముద్రం 15 మీటర్ల మేర ముందుకు వచ్చింది. సముద్రంలో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. పలు చోట్ల తీర ప్రాంతం కోతకు గురైంది. జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.