పైకి ఎగసిన బంగారం, వెండి

SMTV Desk 2019-04-30 13:30:08  Gold Rate, Silver rate, Bullion market

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో మరోసారి పసిడి ధర ఎగసింది. సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ.30 పెరుగుదలతో రూ.33,000కు చేరింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపడం వల్ల కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.38,700కు ఎగసింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.41 శాతం తగ్గుదలతో 1,283.45 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.64 శాతం క్షీణతతో 14.99 డాలర్లకు దిగొచ్చింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.30 పెరుగుదలతో రూ.33,000కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 పెరుగుదలతో రూ.32,830కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది.కేజీ వెండి రూ.250 పెరుగుదలతో రూ.38,700కు చేరితే.. .. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.268 తగ్గుదలతో రూ.37,250కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,000కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,480కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,800కు చేరింది.