న్యూఢిల్లీ: ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డులకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీనేష్ పొగట్, భజ్ రంగ్ పూనియాలను నామినేట్ చేసింది. అలాగే భ్యాన్ చాంద్ అవార్డుల కోసం కోసం భీం సింగ్, జైప్రకాశ్ ల పేర్లను ప్రతిపాదించింది. అర్జునా అవార్డుల కేటగిరిలో రాహుల్ అవారే, హర్ ప్రీత్ సింగ్, దివ్య కక్రాన్, పూజా ధాండా లను ప్రతిపాదించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ద్రోణాచార్య అవార్డుల విభాగంలో వీరేందర్ కుమార్, సుజీత్ మాన్, నరేంద్ర కుమార్, విక్రమ్ కుమార్ ల పేర్లను ప్రతిపాదించింది.