మోదీ, షాలపై సుప్రీంలో కాంగ్రెస్

SMTV Desk 2019-04-29 15:52:50  supreme court, modi , Shaw

ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలపై ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను రేపు విచారణ చేస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినప్పటికీ మోడీ, షాలపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో సుప్రీంను ఆశ్రయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సైన్యం విషయాలను ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఇది ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించడమే అని ఆరోపిస్తోంది. పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ సైన్యాన్ని రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకుంటోందని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఈసీ ఫిర్యాదు చేయగా అటువైపు నుంచి చర్యలు లేకపోవడంతో ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించింది