ప్రేమికుల మధ్య ముదిరిన వంట వివాదం ఎంతటికి దారి తీసిందంటే...

SMTV Desk 2017-08-21 16:21:02  food issue, murder, delhi

ఢిల్లీ, ఆగస్ట్ 21 : వంట నువ్వు చేయి అంటే నువ్వు చెయ్ అని వాదులాడుకున్నారు. సరదాగా పెట్టుకున్న ఆ వాదన కాస్త ముదిరి ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఢిల్లీ ఉత్తమ్ నగర్ లో మూడు నెలలుగా ఉజుమ్మా అనే యువతి నివాసం ఉంటూ తన ప్రియుడైన ఏజు (30) ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వంట ఎవరు చేయాలన్న వాదన మొదలైంది. నువ్వంటే నువ్వంటూ చాలాసేపు వాదించుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఏజు ఆమెపై చేయి చేసుకున్నాడు. కోపోద్రిక్తురాలైన ఉజుమ్మా వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి తనను బెదిరించింది. దీంతో మరోసారి ఆమెపై చేయి చేసుకోగా విచక్షణ కోల్పోయిన ఉజుమ్మా క్షణికావేశంలో అతనిని పొడిచేసింది. తర్వాత తేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న ఏజును తన స్నేహితురాలి సహాయంతో ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి విచారణను చేపట్టారు.