ఎన్నికల్లో విషాదం

SMTV Desk 2019-04-29 13:15:25  Elections, Mahila, Woman died

మధ్యప్రదేశ్‌: నాలుగో దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్ లోని 6 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చింద్వారా లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి 50 ఏళ్ల సునంద కొటేకర్ ఎన్నికల విధుల కోసం ఆదివారం అక్కడకు వెళ్లారు. అయితే సోమవారం విధులు నిర్వహిస్తుండగా ఆమె అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలింది. వెంటనే స్పదించిన ఎన్నికల అధికారి చికిత్స అందించే లోపే ఆమె మృతి చెందింది. ఆమె గుండెపోటుతో మృతి చెందిన్నట్టుగా ప్రధాన ఎన్నికల అధికారి వీఎల్ కాంతారావు నిర్ధారించారు.