బెంగుళూరులో జీతలేక్కువ!

SMTV Desk 2019-04-29 12:15:49  bengulore city, highest paid salary to employees

హైదరాబాద్: ప్రస్తుతం మన దేశంలో ఉద్యోగులకు అధిక వేతనాలు చెల్లించే రాష్ట్రంగా బెంగుళూరు ముందంజలో ఉంది. ఈ నగరంలో ఉద్యోగులు సగటున ఏడాదికి ఉద్యోగులు 10.8 లక్షల జీతం (సీటీసీ) తీసుకుంటున్నారు. రాండ్‌స్టాండ్ ఇన్‌సైట్స్ తాజా నివేదిక ప్రకారం.. బెంగళూరు హైయెస్ట్ పేయింగ్ సిటీగా అవతరించింది. దీని తర్వాతి స్థానంలో పూణే ఉంది. ఇక్కడ ఉద్యోగుల రూ.10.3 లక్షల వేతనం అందుకుంటున్నారు. ఇక దీని తర్వాతి స్థానం ఢిల్లీది. ఇక్కడి ఉద్యోగులు రూ.9.9 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఇక ఈ మూడు నగరాల తర్వాతి స్థానంలో ముంబై ఉంది. ఇ్కడి ఉద్యోగులు రరూ.9.2 లక్షల వేతనం అందుకుంటున్నారు. చివరిలో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా ఉన్నాయి.హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లోని ఉద్యోగులకు ఎక్కువ వేతనం లభిస్తోంది. కన్సూమర్ గూడ్స్, ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. 6 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న వారు ఎక్కువ వేతనాలను అందుకుంటున్నారు.