టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడంతో సినిమా మీద ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ సినిమాని మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’, ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతైమెన స్పందన వచ్చింది.
ఇక సినిమాలోని ఐదో పాట అయిన ‘పాలపిట్ట..’ను ఈరోజు ఉదయం విడుదల చేసింది చిత్ర యూనిట్. శ్రీమణి రాసిన ఈ గీతాన్ని రాహుల్, మానసి ఆలపించారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ‘పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే..’ అంటూ ఇందులో హీరొయిన్ పూజా తో స్టెప్పులేస్తున్నారు సూపర్స్టార్ మహేశ్బాబు.