ముంబయి బౌలింగ్ ... కోల్ కతా నైట్ రైడర్స్ కు చావో రేవో ..

SMTV Desk 2019-04-29 11:20:51  Mumbai, KKR,

కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ 47వ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో విఫలమైన దినేష్ కార్తీక్ సారథ్యంలోని కెకెఆర్ ఆడిన 11 మ్యాచుల్లో కేవలం నాలిగింట మాత్రమే విజయం సాధించింది. దీంతో కోల్ కతా ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు సన్నగిల్లాయనే చెప్పాలి. మరోవైపు ముంబయి ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆడిన 11 మ్యాచుల్లో 7 విజయాలతో ప్లేఆఫ్స్ కు చేరువైంది. ఇవాళ్టి మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.