ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న బెంగళూరు

SMTV Desk 2019-04-29 11:19:51  bangalore, delhi,

న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బెంగళూరుపై ఢిల్లీ జట్టు 16 పరుగుల తేడాతో గెలుపొందింది. పార్థీవ్ పటేల్ 39, స్టోయినిస్ 32, కెప్టెన్ విరాట్ కోహ్లీ 23, శివమ్ దుబే 24, గుర్కీరట్‌సింగ్‌ 27 పరుగులు చేశారు. బెంగళూరు టాప్ ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో శిఖర్ ధావన్(50), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52) అర్ధశతకాలతో రాణించారు. చివరలో రూథర్ ఫోర్డ్(28), అక్షర్ పటేల్(19) బ్యాట్ ఝలిపించడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో చాహాల్ 2 వికెట్లు… ఉమేష్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, షైనీ తలో వికెట్ పడగొట్టారు.