రాణించిన ధావన్ .. శ్రేయాస్ .. బెంగళూరు విజయ లక్ష్యం 188

SMTV Desk 2019-04-28 18:59:24  Dhavan, Shreyas Iyyer

న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్ 46వ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో శిఖర్ ధావన్(50: 37 బంతుల్లో 5 బౌండరీలు, 2 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52: 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. చివరలో రూథర్ ఫోర్డ్(28: 13 బంతుల్లో ఒక బౌండరీ, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్(19: 9 బంతుల్లో 3 బౌండరీలు) బ్యాట్ ఝలిపించారు. ఈ జోడీ 19 బంతుల్లోనే 46 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం. బెంగళూరు బౌలర్లలో చాహాల్ 2 వికెట్లు… ఉమేష్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, షైనీ తలో వికెట్ పడగొట్టారు.