ప్రధాని పై 100 మంది రైతుల పోటీ

SMTV Desk 2019-04-28 18:54:36  Modi, Pm modi

ప్రధాని మోడీ వారణాసి నుండి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపు చాలా సులభమే అయినా ఆయనపై పోటీ చేస్తున్న వారి సంఖ్య మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. హిందూ ఓటర్లు, బీజేపీ కేడర్ బలంగా ఉన్న వారణాసిలో మోడీపై 100 మందికి పైగానే పోటీ చేయనున్నారు. వారిలో ఎక్కువ మంది నిజామాబాద్ పసుపు రైతులే కావడం విశేషం. తమ సమస్యల్ని జాతీయ స్థాయిలో తెలపడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు రైతులు.

నామినేషన్ వేయడం కోసం వారణాసి వెళ్లిన రైతులకు అక్కడి బీజేపీ, ఇంటెలిజెన్స్ ఇబ్బదులు కలిగించినా స్థానిక రైతు సంఘాలు మద్దతు తెలిపి నామినీలుగా నిలిచి సహకరిస్తున్నారు. దీంతో రైతులంతా రేపటితో నామినేషన్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఏపీకి చెందిన 8 మంది రైతులు, తమిళనాడుకు చెందిన 15 మంది రైతులు మోడీపై పోటీకు సిద్దమవగా స్థానికంగా ఉండే మరో 60మంది వరకు మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మొత్తం మీద ఈసారి మోడీపై పోటీ చేయనున్న వారి సంఖ్య 100 మంది వరకు తేలింది.