ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలోని పలు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్వహించింది. బెంగాల్ లోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ స్థానాల్లో ఈ నెల 29వ తేదీన రీ-పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. బెంగాల్ లోని పోలింగ్ స్టేషన్ 19లోని ధోలోగచ్, 37లోని ఇస్లాంపూర్, 191లోని రాయిగంజ్ స్థానాల్లో రీ-పోలింగ్ జరగనుంది. ఒడిశా బ్రహ్మగిరి నియోజకవర్గంలోని 62వ పోలింగ్ బూత్ తో పాటు రాష్ట్రంలో 12 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి సిఫార్సు చేశారు.