భార్యపై ఉన్న అనుమానం వల్లే.....!!!

SMTV Desk 2017-08-21 14:23:41  MARDER, POLICE STATION, HOME GUARD,

కడప, ఆగస్ట్ 21 : భార్యపై పెంచుకున్న అనుమానం చివరికి ఆమెను మృత్యు ఒడికి చేర్చింది. నిత్యం అనుమానంతో రగిలిపోయే భర్త ఆమెను చంపేసి నలుగురు పిల్లల్ని అనాథలను చేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే.. రాజశేఖర్, ఆదిలక్ష్మమ్మ దంపతులు కడప జిల్లాలోని భాకరాపేట గ్రామానికి చెందిన వారు. వీరికి ఆరేళ్లలోపు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజశేఖర్ కడప టూటౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు తాగి వచ్చి తన భార్యను అనుమానిస్తూ, నానా రకాలుగా చిత్రహింసలు పెట్టేవాడు. ఈ క్రమంలో తన భార్యతో మరోసారి గొడవపడిన రాజశేఖర్ తీవ్ర ఆగ్రహానికి గురై ఆమెను కొట్టి చంపేశాడు. ఆమె మృతి చెందడంతో తన నలుగురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అచేతనంగా ఉండిపోయారు. ఈ సంఘటన అనంతరం రాజశేఖర్ పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.