రీసెంట్ గా వచ్చిన ‘కేజీఎఫ్’ మూవీ దక్షిణాదిని ఎలా షేక్ చేసిందో తెలిసిందే కదా. దీంతో స్వీక్వెల్గా ‘కేజీఎఫ్ 2’ తీస్తున్నారు. ఇందులో నటించడానికి కొత్త ఆర్టిస్టులు కావాలని ఇటీవల ప్రకటన ఇచ్చింది మూవీ టీమ్. 8 నుంచి 16 ఏళ్ల వయసున్న అబ్బాయిలు, 25 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పురుషులుకా కావాలి, ఏప్రిల్ 26న బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న ఓ హోటల్లో ఆడిషన్స్ ఉంటాయని తెలిపింది. టెస్ట్ కింద నిమిషం డైలాగ్ చెప్పాలనంది.దీంతో కుర్రకారు, ముదురుకారు వేల సంఖ్యలో వచ్చేశారు. హోటల్ ముందు నోట్లరద్దు నాటి సీన్ కనిపించింది. ఆరు వేల మంది ఆడిషన్స్లో పాల్గొన్నారు. ఇంతమంది వస్తారని ఊహించలేదని, చాలామందిని తాము సరిగ్గా టెస్ట్ చేయాలేకపోయామని టీం చెప్పింది. యశ్ నటించిన ‘కేజీఎఫ్’ 200 కోట్లు వసూలు చేసింది. ‘కేజీఎఫ్ 2లో సంజయ్ దత్, రమ్యకృష్ణ వంటి దిగ్గజాలు నటిస్తున్నట్లు సమాచారం.