చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ ఇండియాలో తన 1000వ స్టోర్ను ప్రారంభించింది. హర్యానాలోని రెవారిలో షియోమీ తన నూతన ఎంఐ స్టోర్ను ఓపెన్ చేసింది. ఇది షియోమీకి 1000వ స్టోర్ కావడం విశేషం, కాగా త్వరలో ఎంఐ స్టూడియో పేరిట నూతన స్టోర్స్ను ఇతర ప్రాంతాల్లో లాంచ్ చేస్తామని షియోమీ వెల్లడించింది. ప్రస్తుతం బెంగళూరు, ముంబై నగరాల్లో మాత్రమే ఎంఐ స్టూడియోలు ఉన్నాయి. ఎంఐ హోం స్టోర్స్ ను మించి వినియోగదారులకు సేవలను అందించేందుకు ఎంఐ స్టూడియోలను దేశంలోని 50 నగరాల్లో త్వరలో ప్రారంభిస్తామని షియోమీ ప్రతినిధులు తెలిపారు.