మాజీ సైనికాధికారులు బిజెపిలోకి

SMTV Desk 2019-04-27 19:19:33  BJP,

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బిజెపిలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు, అధికారులు కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ఏడుగురు మాజీ సైనికాధికారులు బిజెపిలోకి చేరారు. బిజెపి ప్రధాన కార్యాలయంలో వారికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు.

బిజెపిలో చేరిన వారిలో లెఫ్టినెంట్ జనరల్ జెబిఎస్ యాదవ్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే పల్యాల్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఎన్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ సుతిల్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ నితిన్ కోహ్లి, కల్నల్ ఆర్కే త్రిపాఠి, వింగ్ కమాండర్ నవనీత్ మగాన్ లు ఉన్నారు. సాయుధ దళాల్లో వీరు చేసిన సేవలను నిర్మలా సీతారామన్ కొనియాడారు.