అసోంలో భూకంపం..భయాందోనలలో ప్రజలు

SMTV Desk 2019-04-27 19:09:49  Asam, Earth qauke

అసోం : సోనిక్‌పుర్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైందని అధికారులు తెలిపారు. 15 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రంగా గుర్తించినట్టు వారు వెల్లడించారు. ఒక్క సారి భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు