మారుతీరావుకు బెయిల్‌..అమృత స్పందన ఈ విదంగా

SMTV Desk 2019-04-27 16:18:21  amrutha, miryalaguda

గత ఏడాది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతీరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆయన కుమార్తె, స్వర్గీయ ప్రణయ్ భార్య అమృత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పరువుకోసం నడిరోడ్డుపై అల్లుడినే అతికిరాతకంగా నరికించి చంపించిన నా తండ్రికి బెయిల్‌పై మంజూరు చేయడం విస్మయం కలిగిస్తోంది. ఆయన వలన నాకు, నా కుటుంబ సభ్యులకు (అత్తగారి కుటుంబ సభ్యులకు) ప్రాణహాని ఉంది. కనుక మా కుటుంబానికి భద్రతను పెంచాలని నల్గొండా జిల్లా ఎస్పీని కోరాము. నా తండ్రి వలన మాకు ప్రాణహాని ఉన్నందున ఆయన బెయిల్‌పై రద్దు చేయాలని హైకోర్టును కోరుతాము. ఒకవేళ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము,” అని చెప్పారు.