బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్ నగరాలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. దీంతో బెంగళూరు, మైసూర్ నగరాలకు హై అలర్ట్ను ప్రకటించారు. బెంగళూరు, మైసూర్ నగరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో, మతసంబంధ ప్రదేశాల్లో,హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్లు, మార్కెట్లు, మాల్స్, మల్టీపెక్స్లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రద్దీ ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు.