మహాఘట్ బంధన్ చేతిలో బీజేపీకి ఓటమి తప్పదన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. ప్రతిపక్షనేతలను బీజేపీ ప్రభుత్వం ఇరుకున పెడుతుందన్నారు. మాయావతిపై, తమ కుటుంబంపై ఐటీ దాడులు కావాలనే చేయిస్తోందన్న తేజస్వీ.. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు బీజేపీ ఐటీ సెల్ విభాగంగా పనిచేస్తుందని ఆరోపించారు. బీహార్ లోని 40 లోక్ సభ స్థానాల్లో తాము పోటీ చేస్తున్నామని, దాదాపు అన్నీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తిచేశారు. బెగుసరాయ్ స్థానం నుంచి బరిలో ఉన్న గిరిరాజ్ సింగ్ పై..మా అభ్యర్థి తన్వీర్ హసన్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.