రోహిత్ తివారీ హత్య లో మరో ట్విస్ట్

SMTV Desk 2019-04-27 12:30:28  Rohit Tiwari,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్.. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. అదేంటో ఈ కేసులో రోజుకో కొత్త నిజం బయటకు వస్తుంది. రోహిత్ తివారీని అతని భార్య అపూర్వ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా రోహిత్ తివారీ హత్యకు ఆస్తి గొడవలే కారణమని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా కాదని తాజాగా సమాచారం అందుతుంది. రోహిత్ తివారి ఆయన భార్య.. మధ్య కొన్నాళ్ల నుంచీ విభేదాలు ఉన్నాయనీ... ఈ కారణంగానే అపూర్వ... రోహిత్‌ను హత్య చేసిందనే కూడా తెలుస్తోంది. అయితే వీరి మధ్య ఈ గ్యాప్ ఏర్పడటానికి కారణం మాత్రం ఇప్పటివరకు రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ.. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

అదేమంటే రోహిత్‌ను అపూర్వ హత్య చేయడానికి ప్రధాన కారణంపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు.... అసలు కారణాన్ని రాబట్టారు. అదేమంటే... మరదలితో రోహిత్ తివారీకి ఉన్న సంబంధాలే అతడి హత్యకు దారితీశాయనే తేల్చేశారు. సుమారు నాలుగు రోజులు రోహిత్ తివారీ భార్య అపూర్వను విచారించిన పోలీసులు... మరదలితో తన భర్త సన్నిహితంగా ఉండటం చూడలేకే అతడిని హత్య చేసినట్లు అపూర్వ విచారణలో గుట్టు విప్పినట్లు తెలుస్తోంది. కాగా చనిపోయిన రోజు రాత్రి కూడా రోహిత్ తన మరదలితో ఒకే రూమ్‌లో ఉన్నాడని... ఇద్దరు కలిసి మద్యం సేవించారని కూడా భార్య అపూర్వ విచారణలో పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది.