నేడు తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవం

SMTV Desk 2019-04-27 11:47:17  trs,

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. కొద్దిమందితో ప్రారంభం అయిన తెరాస కేంద్రంతో పోరాడి తన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా నేడు రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా నిలిచింది. ఈ సందర్భంగా తెరాస ప్రతీ ఏట మూడు రోజులపాటు అట్టహాసంగా ఆవిర్భావ సభలు నిర్వహించేది. కానీ ఈసారి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించింది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటారు. జిల్లా కార్యాలయాలలో పార్టీ నేతలు కూడా పార్టీ జెండాను ఎగురవేస్తారు.