వెంకయ్యకి పౌరసన్మాన కార్యక్రమం

SMTV Desk 2017-08-21 12:00:33  VICE PRESEDENT, VENKAYYA NAYUDU, RAJBHAVAN,

హైదరాబాద్, ఆగస్ట్ 21 : భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఇటీవల వెంకయ్యనాయుడు గారు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే నేడు రాజ్ భవన్ లో జరగనున్న పౌరసన్మాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనను సత్కరించను౦ది. ఈ మేరకు వెంకయ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వెంకయ్యనాయుడుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వందల మందికి ఆహ్వానం పంపించినట్లు సమాచారం. కాగా కొద్దిసేపటి క్రితమే రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.