బీజింగ్: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షావోమి వరుసగా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులును రిలీజ్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో నూతన వస్తువును దేశీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. షావోమి తీసుకువచ్చి కరెంట్ బల్బ్ పేరు ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్. దీని ధర రూ.999. అయితే తొలి 4,000 ఆర్డర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. అటుపైన ఈ బల్బ్ ధర రూ.1,299కు చేరుతుంది. బల్బ్ షిప్మెంట్స్ మే 20 నుంచి ప్రారంభమౌతాయి. ఎంఐ స్మార్ట్ బల్బ్ గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాకు బల్బ్ ఆఫ్ చేయమని ఆదేశమిస్తే బల్బ్ ఆఫ్ అవుతుంది. అలాగే దీన్ని ఎంఐ హోమ్ యాప్ సాయంతో కూడా ఆఫ్ ఆన్ చేయవచ్చు. ఈ బల్బ్లో చాలా కలర్లు ఉంటాయి. నచ్చిన దాన్ని సెట్ చేసుకోవచ్చు. బల్బ్ 11 ఏళ్లపాటు మన్నికకు వస్తుందని కంపెనీ తెలిపింది.