మళ్ళీ పెరిగిన పసిడి ధర

SMTV Desk 2019-04-26 17:17:21  Gold Rate, Silver rate, Bullion market

న్యూఢిల్లీ: శుక్రవారం ఇండియన్ మార్కెట్లో పసిడి ధర మళ్ళీ పెరిగింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.33,020కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.230 పెరుగుదలతో రూ.38,750కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 1,282.85 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.63 శాతం పెరుగుదలతో 14.97 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.33,020కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.32,850కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది.కేజీ వెండి రూ.230 పెరుగుదలతో రూ.38,750కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.179 పెరుగుదలతో రూ.37,560కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,960కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,440కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,700కు చేరింది.