న్యూఢిల్లీ: ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇండియన్ బాక్సర్ మెరిసాడు. భారత బాక్సర్ అమిత్ పంఘాల్ 52 కేజీల విభాగంలో కొరియన్ ఆటగాడు కిమ్ ఇంక్యూను ఓడించి స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా ఏకపక్షంగా సాగిన పోరులో 5-0 తేడాతో పంఘాల్ గెలుపొందాడు. గతేడాది జరిగిన ఆసియన్ గేమ్స్లోనూ పంఘాల్ స్వర్ణం సాధించడం విశేషం. మరోవైపు భారత ఆటగాళ్లు కవీందర్ సింగ్ బిష్త్, దీపక్ సింగ్లు ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు.