కోల్కతా: గురువారం రాత్రి జరిగిన కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... సులభంగా ఛేదించాల్సిన లక్ష్యంను మేమే క్లిష్టతరం చేసుకున్నాం. మంచి ఆరంభం తర్వాత మధ్య ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడమే ఇందుకు కారణం. రియాన్ పరాగ్ బాగా ఆకట్టుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా పరుగులు చేసాడు. గోపాల్, ఆర్చర్లు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి భాగస్వామ్యమే ఎంతో ఉపయోగపడింది అని స్మిత్ అన్నారు. విజయాలు సాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మొదటలో 5-6 మ్యాచ్లు సరిగా ఆడలేదు. ఇప్పుడే విజయాల బాట పట్టాం. ఈ సమయంలో జొఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ జట్టుకు అందుబాటులో ఉండరు. ఇది మాకు పెద్ద లోటు. ఇక బెంగళూరుతో మ్యాచ్ అనంతరం నేను కూడా జట్టుకు దూరం కావాల్సి ఉంది. అప్పటిలోపు రాజస్థాన్కు మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తాను అని స్మిత్ చెప్పుకొచ్చారు.