ముంభై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సంస్థ అతి త్వరలో జియో గిగాఫైబర్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. రూ.600 కే నెలవారీ బేసిక్ ప్లాన్ ను జియో గిగాఫైబర్ లో అందిస్తారని సమాచారం. రూ.600 నెలవారీ బేసిక్ ప్లాన్లో బ్రాడ్బ్యాండ్, ల్యాండ్ లైన్, టివి సేవలు మూడు ఇవ్వనుందని సమాచారం. అంటే రూ.600 నెలకు కనీసం చెల్లిస్తే ఒకేసారి బ్రాడ్బ్యాండ్, ల్యాండ్ లైన్, టివి సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవలను విడిగా తీసుకుంటే ఎంత లేదన్నా నెలకు రూ.1500 నుంచి రూ.2వేల వరకు కావచ్చు. అదే జియోలో అయితే కేవలం రూ.600 బేసిక్ ప్లాన్ తీసుకుంటే చాలు. కస్టమర్లకు పెద్ద ఎత్తున డబ్బు సేవ్ అవుతుంది. ఇక జియో గిగాఫైబర్ బ్రాడ్బ్యాండ్తో ఏకంగా 40 డివైస్ల వరకు ఇంటర్నెట్కు కనెక్ట్ చేసుకోవచ్చనట. అయితే ఈ సేవలను పొందాలంటే ముందుగా రూ.4500 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సేవల ద్వారా నెలకు 100 జిబి వరకు ఫ్రీ డేటా వినియోగదారులకు లభించడంతోపాటు నెట్ స్పీడ్ గరిష్టంగా 100 ఎంబిపిఎస్ వరకు వస్తుందట. అయితే జియో గిగాఫైబర్ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేది మాత్రం రిలయన్స్ ఇంకా వెల్లడించలేదు.