జోరు మీదున్న బాలయ్య .. ఒకేసారి రెండు మూవీస్

SMTV Desk 2019-04-26 12:50:01  Balakrishna,

ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ తో నందమూరి బాలకృష్ణ నిర్మాతగా భారీ లాసులు ఫేజ్ చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసిందే. ఆ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్తుందట. ఇక ఈ సినిమాతో పాటుగా జై సింహా సినిమా డైరక్టర్ కె.ఎస్ రవికుమార్ తో బాలకృష్ణ మరో సినిమా ఫిక్స్ చేసుకున్నారట.

జై సింహ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. రవికుమార్ సినిమా మే నెల మధ్యలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందట. రెండు సినిమాలను పార్లర్ గా చేస్తారన్నమాట. బోయపాటితో కూడా సింహా, లెజెండ్ తర్వాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా అవడం విశేషం. మరి ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న బాలయ్య బాబుని చూసి కుర్ర హీరోలు షాక్ అవడం ఖాయం.