బీజింగ్: బీజింగ్ లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్కప్ టోర్నీలో భారత్కు రెండు స్వర్ణాలు లభించాయి. ఈ ఈవెంట్లో భారత్కు చెందిన మనూ భాకర్, సౌరబ్ చౌదరీలు గోల్డ్ మెడల్ గెలిచారు. టీమ్ ఫైనల్లో 16-6 స్కోర్తో స్వర్ణాన్ని చేజిక్కించుకున్నారు. చైనాకు చెందిన జియాంగ్ రాక్సిన్, పాంగ్ వీలపై ఇండియన్ టీమ్ విజయం సాధించింది. మరో మిక్సిడ్ ఈవెంట్లోనూ భారత్ స్వర్ణ పతకం వచ్చింది. అంజుమ్ మౌద్గిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్లు 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ దక్కించుకున్నారు. చివరి షాట్లో 20.6 పాయింట్ల సాధించిన స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.