బంగ్లాదేశ్: 153 బంతుల్లో 208 పరుగులు చేసి నాటౌట్గా నిలిసి చరిత్ర సృష్టించాడు బంగ్లాదేశ్ ఆటగాడు. ఢాకా ప్రీమియర్ లిగ్లో సౌమ్య సర్కార్ అనే ఆటగాడు ఈ రికార్డు నెలకొల్పాడు. షేక్ జమాల్ ధన్మోండి, అబహాన్ లిమిటెడ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సర్కార్ 16 సిక్స్లు, 14 ఫోర్ల సహాయంతో 208 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. తొలి వికెటపై సర్కార్, జహురుల్ 312 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లిస్ట్-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2017లో 190 పరుగుల చేసిన అకీబుల్ హసన్ పై ఉన్న రికార్డును సర్కార్ గల్లంతు చేశారు. ఈ డిపిఎల్ ట్రోపీని అబహానీ జట్టు గెలుచుకుంది.