ప్రముఖులకు ప్రాణహానీ...యూపీలో హైఅలెర్ట్

SMTV Desk 2019-04-25 12:58:52  uttarpradesh, delhi cm, kejriwal, uttarpradesh cm, yogi adithyanath, rss chief mohan bhagavath, jaish e mohammed

లక్నో: నిఘా వర్గాలు దేశ ప్రముఖులను ప్రాణ హాని ఉందని హెచ్చరించింది. వీరిలో ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఢిల్లి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లు ఉన్నారు. వీరి హత్యకు పాకిస్తాన్‌లోని జైష్‌-ఎ-మొహమ్మద్‌ కుట్ర పన్నినట్లు వెల్లడైంది. అంతేకాదు పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పలు రైల్వే స్టేషన్లు, ఆలయాలు తదితర ప్రధాన ప్రాంతాల్లో బాంబు దాడులు చేయాలని జెఇఎం ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. దాడులకు పాల్పడతామంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షావ్లిు, ఉత్తరాఖండ్‌లోని రూర్కీ రైల్వే స్టేషన్లకు హెచ్చరిక లేఖలు వచ్చాయి. నిఘావర్గాల హెచ్చరికలతో రాష్ట్రమంతా హైఅలర్ట్‌ ప్రకటించారు అధికారులు.