ధర తగ్గిన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్

SMTV Desk 2017-08-20 17:40:07  Samsung, Galaxy A5, Galaxy A7, Smartphones price drop, Samsung Smartphones price in india

ముంబై, ఆగస్ట్ 20: ఇటీవల భారత మార్కెట్‌లో అమ్మకాలు పెంచుకోవాలనే వ్యూహంతో ఆపిల్ బ్రాండ్ ఫోన్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా స్మార్ట్‌ఫోన్‌ల దిగ్గజ సంస్థ అయిన శాంసంగ్ కూడా ఆఫర్ల బాట పట్టింది. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన గెలాక్సీ ఏ5 వేరియంట్ ధరను రూ. 26,999 నుంచి రూ. 22,900కు గెలాక్సీ ఏ7 ధరను రూ. 30,900 నుంచి రూ. 25,900కు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌లో ఫెస్టివల్ అమ్మకాలపై దృష్టి సారించామని, దీంతో విక్రయాలు మరింత పెరుగుతాయనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్లలో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సి పోర్టు, 1.9 జీహెచ్ ఆక్టా కోర్ ఎస్ఓసీ ప్రాసెసర్ తదితరాలు కామన్ కాగా, ఏ5 5.2 అంగుళాలు, ఏ7 5.7 అంగుళాల స్క్రీన్ తో లభిస్తాయి.