బీజేపీ నేత సత్పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

SMTV Desk 2019-04-25 12:10:02  BJP netha, Sathpal singh

దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఆయా పార్టీల నేతలు వివాదాస్పద విమర్శలకు దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హిమాచల్‌‌ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీని విమర్శించే అర్హత ఏ పార్టీకి లేదు. ప్రధాని నరేంద్ర మోదీపై ఎవరైనా వేలెత్తి చూపితే వారి చేయి నరికేస్తాం. మా పార్టీ ఆదర్శవంతమైన పనులే చేసింది’ అని వ్యాఖ్యానించారు. సత్పాల్ వ్యాఖ్యలపై మిగతా రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. సత్పాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే నెటిజన్లు కూడా సత్పాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.