ఇటీవల విడుదల ఐన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల వంటి పరిణామాలతో రాష్ట్రంలో తీవ్రమైన దుమారం రేపిన సంగతి తెలిసిందే. తప్పులతడకగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయడంతో వారం రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు న్యాయం కోసం ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే .
ఈసారి ఇంటర్ ఫలితాల్లో .. పరీక్ష రాయని విద్యార్థులు పాస్ కావడం, పరీక్ష రాసిన విద్యార్థులు ఫెయిల్ అవడం, టాపర్స్కి సున్నా మార్కులు రావడం వంటి వివాదాలు తెలంగాణలో అగ్గిరాజేశాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతో సుమారు 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలన్నీతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు , జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు ... మరి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ...