మే 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్

SMTV Desk 2019-04-25 11:25:35  sbi, state bank of india, sbi new rules

ముంభై: మే 1 నుంచి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తన కొత్త నిబంధలను అమలులోకి తీసుకురానుంది. అవేంటంటే మే 1 నుంచి తన రుణాలను, డిపాజిట్లను రెపో రేటుతో అనుసంధానం చేయనుంది. దీంతో ఎస్‌బీఐ నుంచి రుణాలు చౌకగా మారతాయి. రెపో రేటుతో రుణ, డిపాజిట్ రేట్లను లింక్ చేయనున్న తొలి బ్యాంక్ ఎస్‌బీఐనే. అలాగే ఈ నిబంధనల వల్ల ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందగలరు. రూ.1 లక్షకు పైన ఉన్న డిపాజిట్లపై 0.25-0.75 శాతం తక్కువ వడ్డీ ఇస్తామని బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. రూ.లక్ష వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉండనుంది. ఇక రూ.లక్ష పైన డిపాజిట్లకు వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంటుంది. బ్యాంకులు వాటి రుణ రేట్లను ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన నిర్ణయిస్తాయి. అయితే బ్యాంకులు చాలా సందర్భాల్లో రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయలేదు. బ్యాంకులు రుణ రేట్లను రెపో రేటుతో అనుసంధానిస్తే.. రెపో రేటు తగ్గినప్పుడల్లా ఈఎంఐ భారం తగ్గుతుంది. రూ.లక్షకు పైన ఉన్నా రుణాలకే రేట్లను రెపోరేటుతో అనుసంధానిస్తారు. రిజర్వు బ్యాంక్ రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో ఎస్‌బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటు ఇప్పుడు 8.6 శాతం నుంచి 8.9 శాతం శ్రేణిలో ఉంది.