పెవిలియన్ బాట పట్టిన లంకేయులు

SMTV Desk 2017-08-20 17:15:48  BCCI, India, Srilanka, ODI Series, Rangiri Dambulla International Stadium, Dambulla, IND VS SRILANKA 2017

దంబుల్లా, ఆగస్ట్ 20: దంబుల్లాలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో బ్యాటింగ్ ఆడుటున్న శ్రీలంక జట్టు 170పరుగులు చేరకుండానే 4వికెట్లు కోల్పోయింది. వైఎస్ చాహల్ వేసిన బంతిని కొట్టిన గుణతిలక(35), రాహుల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు. తరువాత క్రీజ్‌లోకి వచ్చిన తరంగా (13), డిక్ వెల్లా (64), మెండీస్ (36)లు వరసగా పెవిలియన్ బాట పట్టారు. ఇప్పుడు క్రీజ్‌లో మాథ్యూస్ 10 పరుగులతో, సీకే కాప్గెదెరా ఒక్క పరుగుతో కొనసాగుతున్నారు. అయితే ఇప్పటి వరకు టీమిండియా బౌలర్లు చాహల్, జాదవ్, పటేల్‌లు ఈ వికెట్‌లు తీసారు. ప్రస్తుతం లంక స్కోర్ 4వికెట్ల పతనానికి 169 పరుగులతో 33 ఓవర్ల వద్ద ఉంది.