బిజెపి సీనియర్ నేత కిషన్‌రెడ్డి తల్లి కన్నుమూత

SMTV Desk 2019-04-25 11:23:46  BJP leader, Kishan Reddy, Mother

తెలంగాణ బిజెపి సీనియర్ నేత కిషన్‌రెడ్డి తల్లి ఆండాలమ్మ (80) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను గత కొన్ని రోజులుగా అపోలో ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆమె ఆరోగ్యం విషమించడంతో కన్ను మూశారు. ఆమె స్వస్థలమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురులో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కిషన్‌రెడ్డి ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు సమాచారం.