మళ్ళీ క్షీణించిన పసిడి ధరలు

SMTV Desk 2019-04-24 19:17:39  Gold Rate, Silver rate, Bullion market

ముంభై: ఇండియన్ మార్కెట్లో పసిడి ధర మళ్ళీ క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పది గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.32,720కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.200 తగ్గుదలతో రూ.38,225కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,274.75 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.21 శాతం పెరుగుదలతో 14.82 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.32,720కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.32,550కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,710కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,200కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,300కు తగ్గింది.