దుమ్ములేపిన దేవి శ్రీ ప్రసాద్ .. పాట వింటే గూస్ బంప్స్

SMTV Desk 2019-04-24 17:45:03  padara padara song, mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ మహర్షి మీద భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరియర్‌లో 25 మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా..తెరకెక్కుతున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెత్‌లో నిర్మిస్తున్నారు.



మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా పాటల్ని ఒక్కొక్కటిగా విడుదల చూస్తూ హైప్ తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటల్ని విడుదల చేయగా కొద్ది సేపటి కృతం మరో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘పదరా పదరా’ అంటూ సాగిన ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చగా సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో మొదటి మూడు పాటలతో దేవి శ్రీ పర్వాలేదనిపించినా ఈరోజు విడుదలైన ‘పదరా పదరా’ సాంగ్‌ తో తన మార్క్ మళ్ళీ చూపించారు దేవి శ్రీ ప్రసాద్. ఆయన ట్యూన్స్‌కి తగ్గట్టే.. శంకర్ మహదేవన్ అద్భుతంగా ఆలపించారు. ‘పదరా.. పదరా.. పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా’ అంటూ శ్రీమణి ఆకట్టుకునే సాహిత్యం అందించారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి మరి