న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు తెలుగు విద్యార్థులు నిరసనకు దిగారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విద్యార్థులు ఇంటర్ బోర్డు వ్యవహారంపై నిరసన చేపట్టారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి,తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇంటర్ బోర్డు తప్పిదాలపై న్యాయ విచారణ జరిపించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.