హైదరాబాద్: ఈ కామర్స్ సంస్థ వాల్మార్ట్ తన ఫ్లిప్కార్ట్ డేటా సెంటర్ ను తాజాగా హైదరాబాద్ లో ప్రారంభించింది. తెలంగాణ ఐటీ, కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ డేటా సెంటర్ను ప్రారంభించారు. ఇప్పటివరకు దేశంలో రెండు సెంటర్ లను ఏర్పాటు చేయగా.. ఇది తెలంగాణలో మొదటిదని ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన డేటా సెంటర్ ఆపరేటర్ ‘కంట్రోల్ ఎస్’ (సీటీఆర్ఎల్ ఎస్) పార్టనర్షిప్తో దీన్ని నిర్మించినట్లు తెలిపింది. ఈ సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనతో నడవనుంది.