దంబుల్లా, ఆగస్ట్ 20: ఇటీవల భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించిన విషయం సుపరిచితమే. ఇదే ఉత్సాహంతో టీమిండియా-శ్రీలంకల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో బరిలోకి దిగింది. దంబుల్లా వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ తీసుకుంది. శ్రీలంక ఓపెనర్లు గుణ తిలకా, డిక్ వెల్లా క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక 6.3ఓవర్లలో 29 పరుగులు తీసింది. టెస్ట్ సిరీస్ లో జరిగిన పరాజయానికి లంకేయులు ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.