టెక్ దిగ్గజ యాపిల్ సంస్థపై ఓ వ్యక్తి పరువు నష్టం దావా వేశాడు. తన ఐ ఫోన్స్ లో సాఫ్ట్ వేర్ లోపాల కారణంగా తనను దొంగగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నాడు. సంస్థ తీరుతో తన పరువు పోయిందని విమర్శిస్తూ.. ఏకంగా రూ. 7 వేల కోట్లు చెల్లించాలంటూ మన్ హటన్ కోర్టులో దావా వేశాడు ఔస్మేన్ బా. తన ఫోన్ లో ఫేస్ డిటెక్షన్ ద్వారా డేటాను దొంగిలించిన ఓ దొంగ.. ఐ ఫోన్ స్టోర్స్ లో చోరీలకు పాల్పడ్డాడు. దీంతో ఫోటో ద్వారా వ్యక్తి వివరాలు రాబట్టి ఔస్మేన్ బాను అరెస్ట్ చేయడంతో పరువునష్టం దావా వేశాడు. చేయని తప్పుకు మానసిక వేదనకు గురి చేస్తున్న యాపిల్ సంస్థ క్షమాపణ చెప్పాలంటున్నాడు.