ప్రధాని మోదీ పై పోటీకి సిద్దమైన తెలంగాణ రైతులు

SMTV Desk 2019-04-24 15:43:15  Prime minister, Farmers,

పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని, తమ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఇందూరు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో కవితపై పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి హామీ పొందగలిగారు రైతులు. ఇక జాతీయ స్థాయిలో కూడా తమ డిమాండ్లను వినిపించాలంటే కవితపై చేసినట్టే మోడీపై కూడా పోరాటమే కరెక్ట్ అనుకున్నారు.

మోడీ బరిలోకి దిగనున్న వారణాసి నుండి నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ గడువు ఉండటంతో అప్పట్లోగా వారణాసి వెళ్ళాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటే తమిళనాడు ఈరోడ్ పసుపు రైతులు కూడా మోడీపై పోటీకి దిగనున్నారు. ఈ పోరాటం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, తమ సమస్యల్ని జాతీయ స్థాయిలో తెలియజేయడం కోసమని అంటున్నారు.