ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి .. ఇక ప్రధాన పార్టీ లు గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి, ఇక కొన్ని సర్వే లు వైసీపీ అని మరికొన్ని సర్వే లు టీడీపీ అని చెప్తున్నాయి .. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా కొంత మంది నేతలు, స్థానికులు తమ తమ నియోజకవర్గాలలో గెలిచే నాయకులపీ బెట్టింగులు వేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ లు వైసీపీ ,టీడీపీ ల మధ్యనే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది .ఇక ఇందులో అధిక శాతం అభ్యర్థి మెజారిటీ పైనే బెట్టింగ్ లు వేస్తున్నారు. అయితే గతంలో చాలా మంది వైసీపీ అధినేత జగన్ ఆధిక్యం పై బెట్టింగ్ వేయగా, ఈ సారి మాత్రం జమ్మల మడుగు అభ్యర్థి రామ సుబ్బారెడ్డిపై ఎక్కువ బెట్టింగ్లు వేస్తున్నారు. అయితే ఏపీలో ఈ రాజకీయ బెట్టింగ్ల గొడవ తగ్గాలంటే మే 23 ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.